శ్రీవారికి వైభోగం.. అన్నమయ్యకు అన్యాయం.

Spread the love

తాళ్లపాక పై టిటిడి చిన్నచూపు.

వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి.

రాజంపేట (నవ్యంధ్రన్యూస్)

అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు ఉద్దండం సుబ్రహ్మణ్యం జికే నాగరాజులతో కలిసి ప్రత్యేక అధికారి మోహన్ ను ఘనంగా శాలువాతో సత్కరించి సమస్యలతో కూడిన విజ్ఞాపన పత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ మీరు ఇచ్చిన అన్ని సమస్యల పైన త్వరలో ఈవో చైర్మన్,రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గతంలో నిర్వహించినట్లు జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహించేలా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి నాగోత రమేష్ నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు వై సురేష్ రాజులు మాట్లాడుతూ

1.అన్నమయ్య తిరుమలలో ఏర్పాటుచేసిన హుండీలోంచి ఒక శాతం ఆయన జన్మస్థలి తాళ్లపాక గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.

  1. 599 600 జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి తర్వాత గాలికి వదిలేశారు. కనీసం 600 జయంతి ఉత్సవాలు కు కేటాయించిన బడ్జెట్లో అన్నమయ్య జయంతి వర్ధంతి మహోత్సవాలకు 50 శాతం బడ్జెట్ను కేటాయిస్తే ఉత్సవాలను ఘనంగా నిర్వహించవచ్చు. అలాకాకుండా అతి తక్కువ బడ్జెట్ కేటాయించి పేలవంగా జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
  2. అన్నమాచార్యుని పేరిట తిరుమలలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారే కానీ ఆయన పేరుతో ఉన్న ప్రాజెక్టులోని కళాకారులకు న్యాయం జరగడం లేదు.
  3. రాజంపేటకు కు అన్నమయ్య మండలం గా నామకరణం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.
  4. ధ్యాన మందిరం ఎదుట మ్యూజియం ఏర్పాటు కలగానే మిగిలింది.
  5. తాళ్లపాకలో సంగీత కళాశాల ఏర్పాటు చేస్తామని టిటిడి అధికారులతో పాటు ప్రముఖ గాయని శోభారాజు అన్న నెరవేరలేదు.

7 .తాళ్లపాక ఎం జి పురం బోయినపల్లె పంచాయతీలను మెగా టౌన్షిప్ గా చేస్తామని 600 జయంతి ఉత్సవాలు అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేటికీ పట్టించుకునే వారే లేరు.

  1. తాళ్లపాక ముఖ ద్వారం నుంచి తాళ్లపాక గ్రామం వరకు ఉండు వరుసల రహదారితో పాటు ఉద్యానవనం ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతామని చెప్పారు ఆ హామీ కలగానే ఉంది. అదేవిధంగా ముఖద్వారం నుంచి తాళ్లపాక వరకు వివిధ రకాల కవుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ కలగానే మారింది.
  2. అన్నమయ్య తాళ్లపాకలో నివసించిన ఇంటి అడుగున కొత్తగా తాటి ఆకులతో ఇల్లు నిర్మాణం అందులో అన్నమయ్య రాసిన పద కవితలు తాళపత్ర గ్రంధాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అది కలగానే మారింది. తాళ్లపాక మొదటి చెరువులో అన్నమయ్య పద కవితలు రాస్తున్నట్లుగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి చెరువును అందంగా తీర్చి దిద్దుతామని టీటీడీ అధికారులు హామీ ఇచ్చారు ఆ హామీ కలగానే మారింది.
  3. తాళ్లపాక పాఠశాలను టిటిడి దత్తత తీసుకున్నప్పటికీ పాఠశాలకు అదనపు గదులు నిర్మాణం చే పట్టలేదు. గతంలో పాఠశాలకు సంగీత ఉపాధ్యాయులుగా ఆనంద బట్టర్ ఉన్నారు. తర్వాత సంగీత ఉపాధ్యాయుని నియమించలేదు .పాఠశాలకు సంగీత ఉపాధ్యాయులను నియమించి తాళ్లపాక నుంచి పలువురు అన్నమయ్య లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
  4. తాళ్లపాకులో ప్రతి శనివారం లడ్డూలను విక్రయించేవారు తర్వాత ఆ కేంద్రాన్ని మూసివేశారు. మళ్లీ ఆ కేంద్రాన్ని పునరుద్ధరించాలి.
    సుదర్శన్ కౌంటర్ కేంద్రాన్ని కూడా మూసివేశారు దానిని తిరిగి పునరుద్ధరించాలి.
  5. థీమ్ పార్క్ కు సెక్యూరిటీని నియామకం సౌకర్యాల కల్పన చేపట్టలేదు.
  6. అన్నమాచార్యులు ఆరాధ్య దైవమైన సిద్దేశ్వర చెన్నకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్నమయ్య వర్ధంతి జయంతి ఉత్సవాల సమయంలో ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలను నిర్మించలేదు.
  7. తాళ్లపాక లోని సిద్దేశ్వర చెన్నకేశవ సుదర్శన్ చక్ర అన్నమాచార్య ధ్యాన మందిర కళ్యాణ మండపం ప్రాంగణాల్లో పారిశుద్ధ్యం లోపించి మరింత అద్వానంగా దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు ఆలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయాలను పరిశుభ్రంగా ఉంచి భక్తులకు కనీస సౌకర్యాలు అయిన తాగునీరు మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలి.
  8. తాళ్లపాకలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి.
  9. ప్రస్తుతం అన్నమాచార్య ధ్యాన మందిరం శిథిలావస్థకు చేరుకుంది సింహాచలం అప్పన్న ఆలయంలో మాదిరిగా ప్రమాదం జరగకముందే ఆ ధ్యాన మందిరాన్ని తొలగించి నూతనంగా ధ్యాన మందిరాన్ని నిర్మించాలి.
  10. ప్రతిరోజు తాళ్లపాక ధ్యాన మందిరం, అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత సభలు హరికథలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ సంగీత సభలో హరికథలు నిర్వహించే కళాకారులకు కనీసం మైకు సౌకర్యం కూడా కల్పించకపోవడం అత్యంత దారుణం.
  11. చెన్నకేశవ సిద్దేశ్వర స్వామి సుదర్శన్ చక్ర స్వామి ఆలయాలకు ప్రతిరోజు తెల్లవారుజామున పూలు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ వారికి బుద్ధి పుట్టినప్పుడు వాడిపోయిన పూలను పంపిస్తున్నారు దీనిపై చర్యలు తీసుకోవాలి.
  12. అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద కు విచ్చేసి కళాకారులకు పర్యాటకు మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  13. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద నిర్మించి సంవత్సరం కావస్తున్న ప్రారంభానికి నోచుకోలేదు. వెంటనే ఆలయాన్ని ప్రారంభించాలి.
  14. అదేవిధంగా అన్నమయ్య థీమ్ పార్కు ప్రధాన గేటు పక్కన ముస్లింలకు చెందిన ప్రైవేటు కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ యజమాని అప్పటిలో నష్టపరిహారం తీసుకోకుండా తమకు అంతే స్థలాన్ని ప్రధాన రహదారిలో కేటాయించాలని కోర్టుకు వెళ్లి ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించి థీమ్ పార్కు అడ్డంగా ఉన్నటువంటి ముస్లింల కాంప్లెక్స్ రూములను తొలగించి మేడ పెట్రోల్ బంక్ వరకు ప్రహరీ గోడను నిర్మిస్తే అన్నమయ్య థీమ్ పార్కు అందరినీ ఆకట్టుకునేలా అందంగా దర్శనమిస్తుంది.
  15. తాళ్లపాకలో విరిగిపోయిన రథం కు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో రథం మూలకు చేరింది. వెంటనే ఈ రథానికి మరమ్మత్తులు చేపట్టాలి.
  16. అన్నమయ్య జయంతి వర్ధంతి ఉత్సవాలతో పాటు సిద్దేశ్వర చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించే సమయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత ఆహ్వాన పత్రికలను తాళ్లపాకకు తీసుకువచ్చి ఒక గదిలో మూలన పడవేస్తున్నారు. దీంతో ఉత్సవాలు పై ప్రచారం లేక పేలవంగా జరుగుతున్నాయి. అలా కాకుండా 15 రోజులు ముందుగా ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ముద్రించి వాటి ద్వారా స్థానిక అధికారులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఉత్సవాలలో వారితోపాటు ప్రజలను డ్వాక్రా మహిళలను ఉత్సవాల్లో భాగస్వాములు అయ్యేలా ఆర్డీవో ,డిఎస్పి, తహసిల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం నుంచి అధికారకంగా ఆదేశాలు ఉండేలా టీటీడీ వారు ప్రత్యేక జీవోను జారీ చేస్తే ఉత్సవాలు ప్రతి ఏటా విజయవంతం అవుతాయి ఈ దిశగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *