టి టి డి ఉచిత వివాహలకు విశేష స్పందన తిరుమల (నవ్యంధ్ర న్యూస్) తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తితిదే ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. 2025 మే 1 వరకు తితిదే ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని తితిదే వెల్లడించింది. వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే, వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితిలో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *