మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని, ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) అమరావతి (Amaravati) నిర్మాణంపై మంత్రి నారాయణకు (Minister Narayana ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) టార్గెట్ (Target) పెట్టారు. రాజధానిలో మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కూటమి ప్రజాప్రతినిధులతో శనివారం సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
పునఃప్రారంభ సభ విజయవంతం..
అమరావతి ఆవశ్యకతను దేశప్రజలందరికీ వివరించేందుకు అమరావతి పనుల పునఃప్రారంభాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిపించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం కూట మి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పునఃప్రారంభ సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేశారని అభినందించారు.