జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ )
విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీ
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు మద్దతు ఇవ్వడానికి పంపిస్తున్నట్లు యూకే వెల్లడించింది. దర్యాప్తులో తమకు ‘నిపుణుల హోదా’ ఉంటుందని, ఎందుకంటే ప్రయాణికుల్లో యూకే పౌరులు కూడా ఉన్నారని తెలిపింది.