ఆంధ్రప్రదేశ్ ( నవ్యాంధ్ర న్యూస్ ) కేంద్ర,రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఈ ఎన్నికలపై ప్రతి రాష్ట్రంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా చెన్నైలో సోమవారం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకు బయల్దేరారు.
