( నవ్యాంధ్ర న్యూస్ )
అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి భూకంపం
అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 5:06 గంటల సమయంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు.