భారత్ మాతాకి జై…. వందేమాతరం అంటూ పాడే మోసిన కుమార్తెలు
సాధారణంగా తండ్రి చనిపోతే పిల్లలు కన్నీరు, మున్నీరవుతారు. కానీ బీఎస్ఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ అమరుడైన ఇంతియాజ్ కుమార్తెలు మాత్రం తండ్రి చనిపోయాడు అన్న బాధను దిగమింగుకుని తన తండ్రి దేశం కోసం అమరుడు కావడంతో తండ్రి పార్ధీవ దేహాన్ని మోస్తూ భారత్ మాతాకీ జై…. వందే మాతరం అంటూ నినదించారు. తండ్రి పార్థివ దేహాన్ని మోస్తూ వారు చేసిన నినాదాలు పై వీడియోలో క్షుణంగా పరిశీలిస్తే తన తండ్రి ఇంతియాజ్ నుంచి అలవడ్డ దేశభక్తి, పాకిస్థాన్ పై ఉన్న కసి స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇచ్చే డబ్బుకు అమ్ముడు పోకుండా, ప్రతి భారతీయుడికి ఇంతియాజ్ కుమార్తె ల వలె ఇది మనదేశం అన్న భావన ఉంటే ఉగ్రవాదులు మనదేశం వైపు కన్నెత్తి అయినా చూడగలరా?. దేశంలో జరిగిన ఉగ్రదాడులు అన్ని మనదేశంలో ఉన్న చీడ పురుగుల వల్లే కదా. ఈరోజు పహల్గాం సంఘటన కూడా చీడ పురుగుల వల్లే జరిగింది. ఈ సంఘటనే జరగకుంటే మనదేశానికి చెందిన సైనికులు చనిపోయే వారు కాదు కదా. వారి కుటుభాల్లో విషాదం ఉండేది కాదు కదా.