🌺 తిరుమల కాలినడక మహాత్యం 🌺🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒకబ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణముగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు.🌾బ్రహ్మ హత్యా పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వ శక్తులూ సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మ హత్యాపాతకమును ఏవిధంగా పోగొట్టుకొనవలెనా ఎంతో మధన పడసాగాడు.🌾ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒకరోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదులవారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. “🌾ఓ స్వామీ! మహానుభావా సర్వకాల సర్వాపస్థలయందు శ్రీమన్నారాయణునే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం, మీకు తెలియనిదేమున్నది. బ్రహ్మ హత్యాపాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాపనివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరివిధాల వేడుకున్నాడు.

Spread the love

🌾అపుడు నారదులవారు జరిగినదంతయూ గ్రహించి “ఓయీ! ఇంద్రా!
దుఃఖింపవలదు, ఇందులకు ఉపాయము తప్పక గలదు.
🌾నీవు మానవ రూపమున భూలోకములోనున్న వేంకటాద్రికి పోయి కాలినడకన ఆ పర్వతరాజమును అధిరోహించి కొండపై ఆనందనిలయములోనున్న శ్రీమన్నారాయణులవారిని దర్శింపుము.
🌾ఈ మార్గమే నీకు శరణం. సాక్షాత్తు వైకుంఠ వాసి అయిన జగన్నాథుడే శ్రీనివాసునిగా సమస్త ప్రాణికోటి చేతనూ ఆరాధింపబడుతున్న దివ్యప్రదేశం వేంకటాద్రి. అంతటి మహోన్నతమైన ఆ వేంకటాద్రిని వీలైనంత త్వరలో యాత్ర సంకల్పించి ఈ పాపము నుంచి బయట పడవలసినది అని సెలవిచ్చారు.
🌾వెంటనే ఇంద్రుడు నారదులవారికి అనేక సపర్యలు గావించి ఎంతో సంతోషపడి మనస్సులో శ్రీమన్నారాయణులవారిని ఇలా ప్రార్థించాడు.
🌾ఓ జగన్నాథా! శ్రీమన్నారాయణా! నేను తక్షణమే మానవ రూపమున భూలోకము చేరి నీ వేంకటాద్రికి నడిచి ఎక్కి నిన్ను దర్శించుకొనగల వాడను. నన్ను అనుగ్రహింపుము” అని ప్రార్ధించెను. నారదులవారు ఇంద్రుని వద్ద శెలవు తీసుకుని తమ త్రిలోక సంచారం కొనసాగించడానికి బయలుదేరారు.

🌾శ్రీమన్నారాయణులవారి అనుగ్రహంతో మానవరూపం పొందిన
ఇంద్రుడు కళ్ళు మూసి తెరవగానే వేంకటాద్రి వద్దకు చేరాడు.
🌾అలిపిరి
మొదటిమెట్టు ముందు నిలిచాడు.
ఇంద్రునికి తమిళ బ్రాహ్మణరూపం లభించింది.
🌾మనస్సులో శ్రీస్వామి వారికి ప్రార్ధించి మొదట మెట్టుపై కాలు పెట్టాడు. అంతే! శరీరమంతా ఒక్కసారి దివ్యతేజస్సుతో వెలిగిపోయింది. కాలు తగలగానే ఏదో అద్భుత శక్తి ఇంద్రునిలో ప్రవేశించినట్లయింది. 🌾ఏమిటీ విచిత్రం? ఈ కొండ ఇంతటి మహిమాన్వితమైనదా! ఇంతవరకు ఎప్పుడునూ కూడా ఇంతటి అద్భుత అనుభవానికి లోను కాలేదే? ఆహా! ఎంతటి దివ్యప్రదేశం ఈ తిరుమల? మొదటిమెట్టుపై కాలుపెడితేనే ఇంత అద్భుతంగా ఉంటే ఇక పూర్తిగా కొండ ఎక్కినపుడు ఇంకెంత దివ్యంగా ఉంటుందో కదా! అని తలుస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కసాగాడు.
🌾తనతో పాటు నడుస్తున్న భక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. చిన్న పిల్లలు, స్రీలు, వృద్ధులు… అనేక భాషలవారూ… అనేక సాంప్రదాయాలవారు… చిత్ర, విచిత్ర వేషధారణలలో ఉన్నవారు… అనారోగ్యంతో బాధపడుతూ కూడా ముఖంలో దివ్యానందంతో ఎక్కుతున్నవారు.. చంకలో పిల్లలతో తల్లులు… కొందరు తండ్రులు భుజాలపై పిల్లలను మోస్తూ.. తలపై మూటలు, పెట్టెలతో మరికొందరు… ఆహా! వీరందరికీ ఆ శ్రీనివాసుడంటే ఎంతటి భక్తియో కదా! వీరి ముఖాలన్నీ ఎంతటి చిరునవ్వుతో వెలిగిపోతున్నాయో గదా! గోవిందా! గోవిందా! గోవిందా! అంటూ ఎంత చక్కగా ఒళ్ళు మరిచి ఎక్కుతున్నారు కదా! .. అంటూ ఇంద్రుడు ఆనందమూ… ఆశ్చర్యమూ రెండూ కలిగినవాడాయెను.

ఆ విధంగా కొండ ఎక్కుతున్న ఇంద్రుడు చుట్టూ ఎన్నో అద్భుత
దృశ్యాలను గమనిస్తున్నాడు.
🌾దారి కిరువైపులా ఎంతో మంది మహర్షులు తపస్సు చేసుకుంటూ కనిపించారు.
🌾సామాన్య మానవులకు కేవలం వృక్షాలలాగా కనిపిస్తున్న వీరందరూ ఎన్నో కోట్ల సంవత్సరాల నుండీ తపస్సు చేస్తున్నట్లుగా గ్రహించాడు.
కాసేపు కూర్చుందామని ఆగాడు. ఇంతలో పక్కనే ఇద్దరు భక్తులు వచ్చి కూర్చున్నారు. వారిలో ఒకరు రెండవ భక్తునితో ఇలా అంటున్నాడు. “ఇప్పటిదాక ఉన్న అలసటంతా ఒక్కసారి పోయింది. ఈ ప్రదేశంలో మహాత్మ్యం ఏదో ఉంది. శరీరమంతా ఎంతో తేలికగా అనిపిస్తోంది” అని చెప్తున్నాడు.
🌾ఈ భక్తుని అలసట తీరిపోవడానికి కారణం ఆ పక్కనే తపస్సు చేస్తున్న మహా మునీశ్వరుడు ఉండటమే! మానవ మాత్రులైన మనకు వృక్షాల రూపంలో కనపడే మహామునులు ఉండడం చేత తిరుమల గిరులన్నీ మరింత దివ్యంగా ప్రకాశిస్తుంటాయి. ఒక్కోసారి అలసట చెందిన భక్తులు ఏదైనా ప్రదేశంలో ఆగిన వెంటనే అలసటంతా తగ్గిపోయినట్లు అనిపించి రెట్టించిన ఉత్సాహం వస్తుంది. దీనికి కారణం ఆ పక్కనే ఎంతో తపశ్శక్తి గల మునీశ్వరుడు ఉండటమే అని గ్రహించాలి.
🌾కాలినడకన వెళ్ళే ప్రతీ భక్తుడు పాదరక్షలు ధరించకుండా, ఇరు ప్రక్కలా గల వృక్షాలకు నమస్కరిస్తూ, మనస్సులో శ్రీనివాసునే తలుస్తూ నడక కొనసాగించాలి.
హరే కృష్ణ గోవిందా శ్రీనివాసా గోవిందా🌸🙏🌸

స్వామినే ప్రార్థిస్తూ ఎక్కుతున్న ఇంద్రుడికి క్రిందకు దిగుతున్న
భక్తులలో ఒక తేజోమూర్తి కనపడ్డాడు.
🌾ఇంతటి తేజస్సుతో వెలిగిపోతున్న భక్తుడెవరై ఉంటాడా అని ఒక్క క్షణం ఆలోచించాడు.
క్షణంలో ఆ భక్తుడెవరో గ్రహించాడు.
అది మరెవరో కాదు.
సాక్షాత్తూ వాయుదేవుడే !
ఇంద్రుడు ఆశ్చర్యంతో “
🌾ఓ మహానుభావా! వాయుదేవా! ఏమిటీ విశేషం? సామాన్య మానవ రూపంలో నీవు ఎందుకు కొండ దిగి వెళుతున్నావు? ఈ మహారాష్ట్ర భక్తుని రూపమేమటి? సమస్త ప్రాణికోటికీ ప్రాణాధారుడైన నీవు ఇలా
సామాన్య భక్తుని రూపంలో సంచరించడం నాకు ఎంతో ఆశ్చర్యం
కలిగిస్తుంది.” అని కుశల ప్రశ్నలు వేసాడు.

అంతట వాయుదేవుడు ఓ! ఇంద్రా ! నీకివే నా నమస్కారములు.
ఈ తిరుమల అత్యంత పుణ్యప్రదమైనది.
ఈ కొండలలో నా ఉనికి అత్యంత ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే శ్రీమన్నారాయణుని భక్తులందరూ ఇక్కడ ఉన్నంతకాలం చల్లని గాలిలో సేద తీరుతారు.
🌾ఈ కొండ నడిచి ఎక్కుటలోను, దిగుటలోను ఎన్నో దివ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
🌾కాలినడకన చేరే భక్తులందరూ తమ, తమ గత జన్మలలో శ్రీస్వామివారిని ఎన్నో విధాల సేవించినవారే!
🌾ఎన్నో జన్మలు స్వామిని సేవించినవారికే ఈ కాలినడక భాగ్యం లభిస్తుంది.
🌾ఒక్కసారి నడిచి ఎక్కితే వేయి అశ్వమేధయాగఫలం కలుగుతుంది.
అదుగో! ఇంద్రా! అక్కడ
చూడు !
🌾ఆ కనపడే కన్నడ భక్తుడు క్రిందట జన్మలో స్వామిని తన గానమాధుర్యంతో ఎంతో సేవించాడు.. ఆ ఎదురుగా నుంచున్న స్త్రీ భక్తురాలు స్వామిని పూలకైంకర్యంతో ఎంతో సేవించింది.. ఇలా వీరందరూ తమశతమ పూర్వజన్మలలో శ్రీస్వామివారిని ఎన్నో విధాల సేవించిన వారే! అందుకే అత్యంత దయామయుడైన శ్రీస్వామివారు వీరందరికీ ఈ భాగ్యం అనుగ్రహించారు..
🌾ఓ! ఇంద్రా! ఇదుగో ఇప్పుడే మన పక్కనుంచి వెళ్ళిన ఈ భక్తుడు ఈ కొండ 21వ సారి ఎక్కుతున్నాడు! ఇతడు స్వామివారిని ద్వాపరయుగంలో కృష్ణావతారంలో సేవించిన గోపికలలో ఒకడు.
🌾ఆ పుణ్యఫలంచేత ఈ జన్మలో ఇన్ని సార్లు ఎక్కే భాగ్యాన్ని శ్రీస్వామి ప్రసాదించారు… అలాగే ఆ దూరంగా కనపడుతున్న వృద్ధ భక్తుడు ఎవరనుకున్నావు? పూర్వజన్మలో స్వామిని తన దివ్యగానంతో మైమరిపింపచేసిన గాన విదుషీమణి… ఇలా కొండ ఎక్కుతున్న భక్తులందరికీ
🌾శ్రీస్వామివారితో తమ తమ పూర్వజన్మలలో ఏదో ఒక దివ్య బంధం కలిగినవారే. అయితే వారిలో చాలామందికి ఈ విశేషం తెలియదు. పూర్వజన్మ సేవా ఫలంతోనే తాము ఈ కొండనెక్కే అదృష్టానికి నోచుకున్నా
మన్న విషయం భక్తులందరూ గ్రహించాలి అని వాయుదేవుడు ఇంకా
ఇలా చెప్పసాగాడు.
🌾ఓ! ఇంద్రా! నేను శ్రీస్వామివారి ఆజ్ఞానుసారం ప్రతీ పౌర్ణమి నాడూ మానవరూపంలో కాలినడకన ఈ వేంకటాద్రి నడిచి ఎక్కి స్వామిని దర్శించి తిరిగి దిగుతాను. ఇది నాకెంతో ఆనందకరమైనది.
సమస్తలోకాలలోనూ వ్యాపించి ఉన్న నాకు ఈ కొండపై గల అద్భుత
అనుభూతులూ ఇంక ఎక్కడా కలగవు. ఇంతటి దివ్యానుభూతులకు సాటి గల ప్రదేశం ఈ బ్రహ్మాండంలో ఎక్కడా లేదు” అని చెప్పాడు.

ఇలా మాట్లాడుకుంటున్న ఇంద్ర, వాయుదేవుల చెంతనే ఒక
దంపతులు వచ్చి కూర్చున్నారు. వాయుదేవుడు వారితో కుశల ప్రశ్నలు వేసాడు. ఆ దంపతులు తమది ఆంధ్రదేశంలోని విజయవాడ పట్టణమనీ, తమకు వివాహం జరిగి ఏడు సంవత్సరాలైనప్పటికీ ఇంకా సంతానం కలగలేదనీ చెప్పారు. అప్పుడు ఇంద్రుడు మీరేమీ దిగులు పడవద్దు. ఈ స్వామి అత్యంత దయామయుడు. మీకు శ్రీవారి అనుగ్రహం వలన ఒక సంవత్సరంలోనే పండంటి మగపిల్లవాడు జన్మిస్తాడు. అని చెప్పగా ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించి రెట్టించి ఉత్సాహంతో కొండనెక్కడం సాగించారు”.
హరే కృష్ణ గోవిందా
శ్రీనివాసా గోవిందా

వాయుదేవుని వద్ద శెలవు తీసుకుని ఇంద్రుడు కొండనెక్కడం
కొనసాగించాడు. దారిలో ప్రకృతి అందాలకు ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. పక్కనే చెట్టుపై నెమలిని చూశాడు.. మరో పక్కన ఎంతో ముద్దొస్తున్న కుందేళ్ళు… రుం అంటున్న తుమ్మెదలనాదం… ఇవన్నీ గమనిస్తూ కొండనెక్కుతున్న ఇంద్రునికి ఒక వృద్ధ భక్తుడు కనిపించాడు. తనను చూసి చిరునప్పు నవ్వడం గమనించిన ఇంద్రుడు, ఆ భక్తుడెవరో, అతని నిజరూపమేమిటో వెంటనే పోల్చుకున్నాడు. ఆ వస్తున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ శ్రీనివాసుడే!… జగన్నాయకుడైన శ్రీమన్నారాయణుడే వృద్ధ భక్తుని రూపంలో కొండ దిగి వస్తున్నాడు.. స్వామిని సమీపించిన ఇంద్రుడు “స్వామీ! ఆర్తజన రక్షకా! ఆపద్భాంధవా! అనాథరక్షకా! ఏమిటీ విచిత్రం! సాక్షాత్తూ నీవే నడుస్తున్నావా! ఏమిటీ విచిత్రం స్వామి?” అని స్వామికి అనేక నమస్కారాలు గావించాడు. అపుడు వృద్ధభక్తుని రూపంలో ఉన్న స్వామివారు చిరునవ్వుతో “ఓయీ! ఇంద్రా! నాకు నా భక్తులన్న అమిత ప్రేమయని నీకు తెలిసినదే గదా! ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నన్ను దర్శించి వచ్చే ఈ భక్తులతో కలిసి కొండనెక్కడం నాకెంతో ఆనందం. వీరి మంచి చెడూ గమనిస్తూ వీరందరికీ అన్ని భాగ్యాలూ అనుగ్రహించడం నాకు ఆనందం. అందుకే అనేక రూపాలలో నేను ఈ కొండపై సంచరిస్తుంటాను. ఇంతకుముందే నీ తలపైనుంచి వెళ్ళిన చిలుకల జంట ఎవరనుకున్నావు? నేనూ, నా ఇష్ట సఖి శ్రీ మహాలక్ష్మిియే…
మేమిరువురమూ ప్రతీరోజూ అనేక రూపాలలో ఈ కొండతటా సంచరిస్తూ ఆనందిస్తుంటాము” అని చెప్తండగా వెంటనే శ్రీ స్వామి వారి పక్కనే శ్రీమహాలక్ష్మీదేవి కూడా వృద్ధ భక్తురాలిరూపంలో ప్రత్యక్షమైనది. ఇంద్రుడు వెంటనే రెండు చేతులతో నమస్కరించి ఆ తల్లిని ఎన్నో విధాల కీర్తించాడు.

🌾ఇంద్రుడు వారితో “శ్రీ లక్ష్మీ నారాయణులారా! మీరెంతటి
భక్తాధీనులు! మిమ్ములను కొలిచేవారి భాగ్యమే భాగ్యము. మీవంటి
వారుండగా ఈ భక్తులకు కావలిసినదేమున్నది? అని అన్నాడు.
🌾అపుడు శ్రీనివాసుడు, శ్రీమహాలక్ష్మి ఇంద్రునితో ‘మాకు ఇరువురికీ ఈ భక్తులందరూ ఆప్తులు, ఈ కొండ నడిచి ఎక్కుతున్న వీరందరూ గత జన్మలలో మా మిత్రగణం లోనివారే.
🌾అనేక కారణాలచేత మానవ జన్మలు పొందిన వీరందరూ పూర్వ జన్మ వాసనల చేత తిరిగి మా అనుగ్రహం కోసం ఈ కొండను కాలినడకన ఎక్కి మమ్ముల దర్శించవస్తున్నారు.” అని అంతర్భానమైనారు.

🌾సమస్త దేవతలూ వేంకటాద్రిని దివ్యరూపాలలో నడిచి ఎక్కి స్వామిని దర్శించుకోడానికి ఉవ్విళ్ళూరుతుంటారు.

🌾నిత్యం కాలినడకన తిరుమల చేరి స్వామి దర్శనానికి వచ్చేవారిని చూస్తూ తమకు కూడా మానవ జన్మ కలిగితే ఎంత అదృష్టమో కదా అని తలుస్తుంటారు. దివ్యరూపు లైనటువంటి తమకి అంతటి భాగ్యం లేదు కదా అని వాపోతుంటారు.
హరే కృష్ణ గోవిందా
శ్రీనివాసా గోవిందా
🌸🙏🌸🌾🌸🎻🌸

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *