డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

Spread the love

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

రాష్ట్రాల వారీగా ఖాళీల ఇవే..

అహ్మదాబాద్‌లో పోస్టుల సంఖ్య: 240

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 180

కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 250

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్లో పోస్టుల సంఖ్య: 200

ఒడిశాలో పోస్టుల సంఖ్య: 100

హరియాణాలో పోస్టుల సంఖ్య: 306

జమ్ము & కశ్మీర్, లడఖ్‌, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో పోస్టుల సంఖ్య: 80

తమిళనాడు, పుదుచ్చేరిలో పోస్టుల సంఖ్య: 120

నార్త్‌ ఈస్ట్రన్‌లో పోస్టుల సంఖ్య: 100

తెలంగాణలో పోస్టుల సంఖ్య: 230

రాజస్తాన్‌లో పోస్టుల సంఖ్య: 200

కోల్‌కతాలో పోస్టుల సంఖ్య: 150

లక్నోలో పోస్టుల సంఖ్య: 280

మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 250

ముంబయి మెట్రో(మహారాష్ట్ర, గోవా)లో పోస్టుల సంఖ్య: 100

న్యూఢిల్లీలో పోస్టుల సంఖ్య: 30

తిరువనంతపురంలో పోస్టుల సంఖ్య: 90

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 3, 2025 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్ధులు మే 01,1995 నుంచి ఏప్రిల్ 30, 2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన మే 29, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్‌ పరీక్ష జులై 2025లో జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 వరకు జీతంగా చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం..
ప్రిలిమినరీ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 120 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలకు 30 మార్కులకు, బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎకానమీ విభాగంలో 30 ప్రశ్నలు 30 మార్కులు, కంప్యూటర్‌ యాప్టిట్యూడ్‌లో 20 ప్రశ్నలు 20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటలపాటు ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *