హీరో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెంట్ లో అతడిపై ఓ వీడియో (ఏవీ) ప్రదర్శించారు. అది చూసి మనోజ్ చలించిపోయాడు. ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ‘భైరవం’ సినిమా మే 30న విడుదల కానుంది.
